Sunday, May 5, 2024

అధికార గర్వమా…బలుపా !! మహిళపై తెరాస లీడర్ దాడి

అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారం చేతిలో ఉంది కదా అని గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ నాయకులు వరకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నడిరోడ్డుపై ఓ మహిళల బట్టలు చిరిగేలా చితకబాదాడు టిఆర్ఎస్ గల్లీ నాయకుడు. భర్త లేని ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని బి జె ఆర్ నగర్ జ్యోతిరావు పూలే నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. జక్కుల భాస్కర్ పై భారతీయ యువతి కి చిన్న వివాదం రావటంతో జవహర్ నగర్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని బాధిత మహిళ పై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే బాధిత మహిళకు స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement