Friday, May 10, 2024

Hyderabad: టోనీ క‌స్ట‌డీ : క‌దులుతున్న డ్ర‌గ్స్ డొంక

రాష్ట్రంలో డ్రగ్స్‌ దందాపై ఇప్పటికే ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది కేసీఆర్‌ సర్కార్. డ్రగ్స్‌ కట్టడి విషయంలో ఎంతటివారినైనా వదలొద్దని ఆదేశించారు సీఎం కేసీఆర్. నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా ఒప్పుకునేదే లేదన్నారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా వదలొద్దన్నారు కేసీఆర్ స్పష్టం చేశారు..


అయితే డ్రగ్స్ కేసు డొంక కదులుతోంది. టోనీతో సంబంధాలున్న వారిని పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో పట్టుబడ్డ కెల్విన్‌కి టోనీతో సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వ్యాపార, సినీ రంగానికి చెందిన పలువురికి కెల్విన్ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. కెల్విన్‌కు చెందిన కస్టమర్లతో టోనీకి లింక్స్ ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు. కెల్విన్‌ కస్టమర్లలో కొందరికి టోనీ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీసులు టోనీని 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తల లింక్‌లను వెలికి తీయనున్నారు. వ్యాపారవేత్తలు ఇచ్చిన పార్టీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టోనీ వద్ద డ్రగ్స్‌ తీసుకొని కొందరు వ్యాపారస్తులు పార్టీల్లో సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వ్యాపారులు ఎక్కడున్నార‌నే కోణంలో పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement