Saturday, May 4, 2024

మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు.. ఒక్కరోజులోనే కేజీకి రూ.28 పెరుగుదల

అమరావతి, ఆంధ్రప్రభ : టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. నెల రోజులుగా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరలు కాస్త తగ్గుతాయని అంచనా వేస్తే.. మళ్లీ మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి. మదనపల్లెలో బుధవారం నాణ్యమైన టమాటా అత్యధికంగా కిలో రూ.168 పలికింది. మార్కెట్లో మంచి గ్రేడ్‌ రూ.140 నుంచి రూ.168 వరకు ధర పలుకుతుంది. మరో గ్రేడ్‌ కిలో రూ.118 నుంచి రూ.138 వరకు ఉంది. సగటు-న కిలో రూ.132 నుంచి రూ.156 వరకు ఉందంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

బుధవారం మాత్రం కిలో టమాటా ధర రూ.140 ఉండగా.. ఒక్కరోజులోనే కేజీకి రూ. 28 పెరిగింది. అంతేకాదు వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది. దీంతో మదనపల్లె మార్కెటు-్క కేవలం 361 టన్నులు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. దిగుబడి తగ్గడం వల్లే ధరలు మళ్లీ పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు.. అదే జరిగితే సామాన్యుడు టమాటాలను కొనలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు.

రూ.50లకే కేజీ టమాటా.. ఆఫర్‌ కోసం క్యూ కడుతున్న జనం

నెల రోజులుగా టామటా ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కిలో టమాట ధర రూ.200 వరకు కూడా చేరింది. టమాటా ధరలు కొండెక్కడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ప్రజల కోసం సబ్సీడీ రూపంలో టమాటాలను రైతు బజార్లలో పంపిణీ చేస్తోంది. రైతు బజార్లలో కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సీడీ టమాటాలు ఇస్తున్నారు. కేజీ రూ.50 చొప్పున సబ్సీడీ టమాటాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో రైతు బజార్లకు జనాలు క్యూ కడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement