Friday, May 17, 2024

కరోనాతో మరో టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

ఇటీవలే ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా.. ఆయన మరణవార్త మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో చేదు వార్త అందింది. యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాతో నంద్యాల రవి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘పవర్ ప్లే’ సినిమాలకు రచయితగా పని చేశారు. ఆస్పత్రిలో వైద్య ఖర్చులు రూ.7 లక్షలు అయ్యాయని తెలుసుకున్న కమెడియన్ సప్తగిరి వెంటనే స్పందించి ఇటీవల రూ.లక్ష సాయం చేశాడు. అయినా కొద్దిరోజులకే నంద్యాల రవి ప్రాణాలు వదిలాడు. కాగా నంద్యాల రవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement