Friday, May 3, 2024

TN: ఇప్పుడు ప‌ర్లేదు.. హీరోయిన్ యాషికా కోలుకుంటోంది..

త‌మిళనాడులో ఈమ‌ధ్య‌ జ‌రిగిన ఓ యాక్సిడెంట్‌లో సినీ నటి యాషికా ఆనంద్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఆ యాక్సిడెంట్‌లో ఆమె ఫ్రెండ్‌ పావని చ‌నిపోయారు. ప్ర‌స్తుతం యాషికా హాస్పిట‌ల్‌లో కోలుకుంటోంది. ఒక్కో అడుగు వేస్తూ.. న‌డ‌వ‌డానికి చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు సంబంధించిన వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

చెన్నైలోని ప్రైవేటు హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల‌ సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నట్టు ట్విట్ట‌ర్‌లో యాషికా వివ‌రించింది. త‌న‌కు త‌గిలిన గాయాల‌ను, ప‌డుతున్న బాధ‌ను తెలుపుతూ ఆమె క‌న్నీరు పెట్టుకుంది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, యాక్సిడెంట్ కేసులో ఆమెను త్వరలోనే పోలీసులు విచారించనున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన నోటా సినిమాలోనూ యాసికా హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement