Friday, April 26, 2024

BREAKING : టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీ.. తల్లీబిడ్డ మృతి

తిరుపతి సిటీ : టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో తల్లీబిడ్డ మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఎం.ఆర్ పల్లి సిఐ సురేందర్ రెడ్డి కథనం వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పరపల్లి నందుకాపురం ఉంటున్న రుద్రయ్య తన బిడ్డకు అనారోగ్య సమస్య ఉండడంతో భార్య ఎన్.మీనా (26).. కుమారుడు చందు (2)తో ద్విచక్ర వాహనంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా.. మహిళా యూనివర్సిటీ సమీపంలో వెనుక వైపు ద్విచక్ర వాహనాన్ని టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌ల్లీబిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. దీనిపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. తల్లి బిడ్డ మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నేరు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement