Wednesday, April 24, 2024

Breaking : డ్రగ్స్ పై పోరాడితే మా ఆఫీస్ పై దాడి చేశారు.. చంద్రబాబు

టిడిపి అధినేత..చంద్రబాబునాయుడు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా వారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా జీవితం అంధకారంగా మారిపోయిందన్నారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలు తీసుకువస్తారా అని నిలదీశారు.నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు.తన సొంత నియోజకవర్గంలో తననే అడ్డుకున్నారని చెప్పారు చంద్రబాబు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ కల్యాణ్ ని అడ్డుకున్నారన్నారు.ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అడ్డుకున్నారన్నారు.గంజాయి..డ్రగ్స్ పై పోరాడితే మా ఆఫీస్ పై దాడి చేశారన్నారు.రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement