Thursday, May 2, 2024

‘టైగర్ నాగేశ్వరరావు’ లేటెస్ట్ అప్డ‌ట్.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ కి సూప‌ర్ ప్లాన్

వంశీ కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ‌ రవితేజ హీరోగా తెర‌కెక్క‌స్తున్న‌ మూవీ టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్ని ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తోండగా.. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

అయితే ఈ సినిమా నుంచి రివితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు బిగ్ ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. మే 24న వెంకటేష్, కార్తీ, శివ రాజ్‌కుమార్, దుల్కర్ సల్మాన్, జాన్ అబ్రహంతో సహా స్టార్-స్టడెడ్ లైనప్ పోస్టర్‌ను డిజిటల్‌గా ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అంతేకాకుండా, పోస్టర్ విడుదల కోసం మేకర్స్ ఆసక్తికరమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. రాజమండ్రిలోని హేవ్‌లాక్ బ్రిడ్జి (గోదావరి)పై రవితేజ ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీనుంచి రవితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ పై అప్డేట్ అభిమానులలో ఉత్కంఠను రేకెత్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement