Friday, April 26, 2024

వెస్టిండీస్ టీ20 సిరీస్ కు… కోహ్లీ, బుమ్రా దూరం..

జూలై 22 నుంచి అగస్ట్ 7 వరకు వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్ కోసం విండీస్ వెళ్లనుంది టీమిండియా. ఇప్పటికే వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇవాళ టీ20 జట్టును ప్రకటించింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, రవి విష్ణోయ్,కుల్ దీప్ యాదవ్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ ఉన్నారు. కేఎల్ రాహుల్, కుల్ దీప్ యాదవ్, అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే విరాట్ కోహ్లీ, బూమ్రలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement