Sunday, May 5, 2024

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ : స్పీకర్ పోచారం

దేశంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌ని, దేశానికే దిక్సూచి లాంటిది సీఎం కేసీఆర్ పరిపాలన అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో 29 రాష్ట్రాలలో ఐదు ఆరు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నాయని, వారు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు లేవని అన్నారు.

గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో చేపట్టిన హరితహారం కారణంగానే నేడు రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులు అన్నీ నిండుకున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు రైతుబీమా కల్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు తదితర పథకాలు పేదలకు బాసటగా నిలిచాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement