Monday, May 6, 2024

ఇది నేను తయారుచేసిన గుజరాత్‌.. ఎన్నికల ప్రచారంలో మోడీ కొత్త నినాదం

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు వల్సద్‌ జిల్లాలో జరిగే రోడ్‌షో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత స్వరాష్ట్రంలో ఇక్కడ ప్రధాని పర్యటన ఇదే తొలిసారి. మధ్యాహ్నం 5.45 గంటలకు సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రులు లేని 500 మందికి పైగా అమ్మాయిలకు ఇక్కడ సామూహిక వివాహాలు నిర్వహించారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అక్టోబర్‌ 13న అహ్మదాబాద్‌లో జరిగిన ‘గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర’లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనగా, దీనికి ఒకరోజు ముందు మెహ్సానాలో ‘గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర’కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్‌ 12న ప్రధాన మంత్రి రాజ్‌కోట్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలవో పాల్గొని, ర్యాలీ అనంతరం రోడ్‌షో నిర్వహించారు. అమోద్‌, బరౌచ్‌లో రూ.8,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. జంబుసార్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement