Thursday, May 2, 2024

ఓటీటీలో ‘థ్యాంక్యూ’ చెబుతార‌ట‌.. నష్టాలను పూడ్చుకునే ప్లాన్​లో దిల్​ రాజు

నాగ చైతన్య హీరోగా న‌టించిన థాంక్యూ సినిమా ప‌ర్వాలేదు అనే టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద కలెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. ఈ మూవీ పరాజయాన్ని చవిచూసి దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. థాంక్యూ మూవీకి చాలా వరకు ప్రతికూల రివ్యూస్ వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దీంతో నష్టాన్ని పూడ్చుకోవడానికి నిర్మాత‌ దిల్ రాజు ముందుగానే OTT విడుదలకు వెళ్లాలని నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ఆగస్ట్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న‌ట్టు తెలుస్తోంది. సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్, సాయి సుశాంత్ రెడ్డి, అవికా గోర్ కలిసి నటించారు. నాగచైతన్యకు సూపర్‌హిట్ అందించిన మ‌నం డైరెక్ట‌ర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement