Thursday, May 2, 2024

31వ తేదీన‌ సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి రాతపరీక్ష.. వెల్ల‌డించిన అధికారులు..

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : సబ్‌ఇంజనీర్‌ పోస్టుల రాతపరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఈ నెల 31 న జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నాం 12:30 గంటల వరకు రాతపరీక్ష ఉంటుందని రఘుమారెడ్డి తెలిపారు. మొత్తం 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఈ రాత పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు హాల్‌ టికెట్లను సంస్థ వైబ్‌సైట్‌ డౌన్‌లోడు చేసుకోవాలని సూచించారు. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనీ గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రంలోకి రావాలన్నారు. ఒక్క నిమిషనం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోని అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement