Tuesday, May 14, 2024

అజేయంగా దూసుకుపోతున్న టీమిండియా.. న్యూజిలాండ్ పై సూప‌ర్ విక్ట‌రీ

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ అజేయంగా దూసుకుపొతుంది. వ‌రుస‌గా ఐదో మ్యాచులోనూ విజ‌యం సాధించింది.. ధర్మశాల వేదిక‌గా ఇవ్వాల (ఆదివారం) టేబుల్ టాప‌ర్స్ మ‌ధ్య‌ జ‌రిగ‌గిన మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజ‌యం సాధించింది.

ఈ గెలుపుతో పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌రోసారి భార‌త్ టాప్ ప్లేస్ ప‌దిలం చేసుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలండ్ జ‌ట్టు.. నిర్ణీత 50 ఓవ‌ర్లలో 274 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా, చేజింగ్ కు దిగిన భార‌త్.. విశ్వ‌రూపం చూపించింది.. 48 ఓవ‌ర్లో వికెట్ల 6 న‌ష్టానికి విజ‌య ల‌క్ష్యం చేరుకుంది.

భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శర్మ (46), శుభమాన్ గిల్ (26), శ్రేయాస్ అయ్యర్ (33), కేఎల్ రాహుల్ (27) పరుగుల చేయగా., విరాట్ కోహ్లీ (95) పరుగులతో మెరుపులు మెరిపించాడు, ఇక రవీంద్ర జడేజా 39-నాటౌట్ ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఇక అంత‌క ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టులో డారిల్ మిచెల్ (130) సెంచరీతో కదం తొక్కాడు. రచిన్ రవీంద్ర (75) అర్ధ శతకంతో రాణించాడు. ఇక‌ వీరిద్దరు మినహా ఆ జట్టులో మ‌రెవ‌రూ అంత‌గా రాణించలేక‌పోయారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ ఐదు వికెట్లతో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement