Wednesday, May 15, 2024

Breaking | గూడెం మ‌హిపాల్‌రెడ్డి ఇంట విషాదం.. ప‌రామ‌ర్శించిన మంత్రి హ‌రీశ్‌రావు

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో (ప్ర‌భ‌న్యూస్): పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహిపాల్‌ రెడ్డి పెద్ద కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు. అనారోగ్యంగో బాధపడుతున్న ఆయన మూడు రోజులుగా సిటీలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవ్వాల (గురువారం) తుదిశ్వాస విడిచాడు. కాగా, విష్ణువర్ధన్ రెడ్డి పార్థీవ దేహాన్ని మంత్రి హ‌రీశ్‌రావు సంద‌ర్శించి నివాళులు అర్పించారు. కొడుకు మరణవార్త విని ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్‌రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. ఆయనను ప‌రామ‌ర్శించిన మంత్రి హరీశ్​రావు ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement