Friday, May 3, 2024

ఇండియాలో కరోనా కేసులు@మూడు కోట్లు!!

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే కొత్తగా క‌రోనాతో 1,358 మంది మరణించారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం మృతుల సంఖ్య 3,90,660 చేరింది. మరోవైపు నిన్న ఒక్క రోజులో 68,817 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక దేశంలో మొత్తం నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709 కి చేరింది. కాగా ఇందులో 2,89,94,855 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 6,43,1941 యాక్టీవ్‌ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement