Saturday, May 18, 2024

యూపీలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు నలుగురు మృతి..

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ ప్లాజా సమీపంలో రహంకల యమునా వంతెనపై స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనలో నలుగురు మృతి చెందారని, ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో స్కార్పియో కారు ఆగ్రా వైపు వెళ్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement