Thursday, May 2, 2024

అక్కకి వేధింపులు… చంపి ముక్కలు చేసిన బావమరిది

అక్కను వేధిస్తున్నాడని బావను బావమరిది చంపిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. చంపి ముక్కలుగా చేసి పూడ్చిపెట్టిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే పలమనేరు రూరల్ మండలం, పందేరుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, కేటిల్ ఫార్మ్ కు చెందిన భాగ్యలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తెను వరుసకు తమ్ముడు అయిన నవీన్ కు ఇచ్చి పెళ్లిచేయాలని భర్త నాగరాజుకు భాగ్యలక్ష్మి చెప్పడంతో ఇష్టం లేని నాగరాజు, తరచూ భాగ్యలక్ష్మి తో గొడవ పడి చేయిచేసుకునేవాడు.

గత నెల 5న పుట్టింటిలో ఉన్న భాగ్యలక్ష్మి ని అక్కడికివెళ్లిన నాగరాజు అమ్మఒడి నగదు ఇవ్వాలని గోడవచేసి నవీన్ ముందే చేయిచేసుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ గత నెల 12వ తేదీ పందేరుపల్లి కి వెళ్లి, తాగిన మైకంలో ఉన్న నాగరాజు తలపై బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఇంటిపక్కనే ఉన్న ఓ గుంతలో శవాన్ని ముక్కలు చేసి పూడ్చిపెట్టాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. శవాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. నవీన్, భాగ్యలక్ష్మి లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement