Thursday, May 16, 2024

సెలబ్రెటీల చూపు.. షర్మిల వైపు


తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న వైఎస్ షర్మిల వైపే అందరి దృష్టి నెలకొంది. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. తెలంగాణలోని జిల్లాల నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారు. రాజన్న రాజ్యం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాల నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా వైఎస్ షర్మిలను కలుస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిలను లోటస్ పాండ్‌లో పలువురు సెలబ్రటీలు కలిశారు. తాజాగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా కలిశారు. ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్, ఆనం మీర్జాలు చెప్పారు. ఒకవేళ ఈ ఇద్దరు షర్మిల పార్టీలో చేరితే, మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement