Friday, May 3, 2024

Delhi: 2026లో తొలి బుల్లెట్ రైలు ప‌రుగులు..రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్

న్యూఢిల్లీ – 2026 నాటికి బుల్లెట్‌ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్‌.. పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని తెలిపారు.


‘బుల్లెట్‌ రైలు కోసం 500 కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు పలు దేశాలకు దాదాపు 20సంవత్సరాలు పట్టింది. భారత్‌ మాత్రం 8-10 సంవత్సరాల్లోనే పూర్తిచేయనుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 2026 నాటికి బుల్లెట్‌ రైలు పట్టాలెక్కనుంది. ముందుగా గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు నడపనున్నాం. 2028 నాటికి ముంబై-అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని చెప్పారు.

ఇదిలా ఉంటే దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్‌-ముంబై మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే.. 2.58 గంటల్లోనే అహ్మదాబాద్‌ నుంచి ముంబై చేరుకోవచ్చు. 2028 నాటికి అహ్మదాబాద్‌-ముంబై పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. రూ.1.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement