Monday, May 13, 2024

Delhi | బీసీ బిల్లుకు కేంద్రం చొరవ చూపాలి.. బీసీ సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను శనివారం ఆలిండియా ఓబీసీ జ్యోతిరావు పూలే అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల ప్రసాద్ నాయుడు కలిసి వినతిపత్రం సమర్పించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. కుల ప్రాతిపదికన జనగణన చేపట్టాలని, కులాలవారీగా ఎవరు, ఎక్కడ, ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే సంక్షేమ ఫలాలు సరిగా అందుతాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీల్లాగే బీసీలకు రిజర్వుడ్ స్థానాలు కేటాయించాలని ఆయన కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement