Friday, May 3, 2024

గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి.. మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్

ధర్మారం : గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఈరోజు ధర్మారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులను మంత్రి కొప్పుల దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… విఘ్నాలను తొలగించే గణనాథుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలతోపాటు అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా కరుణించాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని, నిమజ్జనం సందర్భంగా చెరువులు, నిమజ్జనం జరిగే ప్రాంతాలలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈకార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement