Sunday, April 28, 2024

ఒకే రూములో ముగ్గురు మహిళలతో ‘పాడు’ పని.. పోలీసుల డెకాయ్​ ఆపరేషన్​

దేశ రాజధాని ఢిల్లీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. అనంతరం నలుగురు మహిళలు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలోని దిల్ షాద్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు.

అందులో ఓ కానిస్టేబుల్ ను డెకాయిగా ఆ ఇంటిలోకి పంపించారు. డెకాయిగా వెళ్లిన కానిస్టేబుల్ ను ఓ మహిళ ఆ ఇంటిలోని అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లి మాట్లాడింది. తన వద్ద మొత్తం ముగ్గురు మహిళలున్నారని, ఒక్కొక్కరికీ రూ. 1500 చొప్పున తీసుకుంటున్నట్లు చెప్పింది. అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆ కానిస్టేబుల్ తమ టీమ్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఓ విటుడితోపాటు నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement