Thursday, May 2, 2024

తెరాస మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజలు ఉరికించి కొడతారు…కోమటిరెడ్డి

కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా.. ఏమయింది కేసీఆర్ అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకు కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు కేసీఆర్.కరోనా తో ప్రజలు పిట్టల రాలుతుంటే ని కంటికి కన్పించడం లేదా?కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు ని కొడుకు కేటీఆర్ కు అప్పగించావు. కరోనా ను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ ను ప్రజలు ట్విట్టర్ వేదిక గా నిలదీస్తున్నారని అన్నారు కోమటిరెడ్డి.

మీ కొడుకు కేటీఆర్ …ని దృష్టికి తీసుకవస్తాను అని చెప్పారు. మీ దృష్టి కి …మీ కొడుకు కేటీఆర్ తీసుకవచ్చారా లేదా చెప్పాలి అని అడిగారు.ఎప్పుడు ఆరోగ్య శ్రీ లో చేర్చుతారని నిలదీశారు. రాష్ట్రంలో అయ్యా…కొడుకుల డ్రామాలు ఆపండి.
కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజల కోసం ఆలోచించండని అన్నారు. కరోన నుండి ప్రజలను కాపాడమని కోరారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చకపోతే అయ్యా కొడుకులను చరిత్ర క్షేమించదు.కరోనా తో అల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించకపోతే అధికారంలో ఉండి ఏమి ఉద్ధరిస్తావుని నిలదీశారు.

ప్రజలను కాపాడలేకపోతే ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హుతా లేదు . నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా…నీ కుటుంబం కోసమా అని ప్రశ్నించారు.కేసీఆర్… ని పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కేసీఆర్ కు ప్రజల ఉసురు తగులుతుంది. ఆరోగ్య శ్రీ లో చేర్చకపోతే టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు ఉరికించి ఉరికించి కోడుతారు. కేసీఆర్ ఇకనైనా కండ్లు తెరవండి అంటూ విమర్శలు చేశారు కోమటిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement