Thursday, May 2, 2024

TS | రావులపల్లిలో ఉద్రిక్తత… భారాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య గొడవ

కొడంగల్, ప్రభ న్యూస్ : కొడంగల్ నియోజక వర్గంలోని రావులపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఆ గ్రామంలో ఏమి జరుగుతుందోననే పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సొంత గ్రామమైన రావులపల్లి. మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. భారాస నేతల ఇంటికి వెళ్లి తమకు సహకరించాలని కోరారు.

ఇదే విషయమై భారాస నేతలు మా వద్దకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సమాచారం తెలుసుకున్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, భారాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి రావులపల్లి గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే గ్రామానికి పోలీసులు చేసుకొని స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిగి డీఎస్పీ పర్యవేక్షణలో గ్రామంలో బందో బస్తు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement