Monday, April 29, 2024

National : మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌…అస్సాం రైఫిల్స్ ద‌ళాల మోహ‌రింపు…

మ‌ణిపూర్‌లో మ‌రోసారి ఉద్రిక్త‌త నెల‌కొంది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ ద‌ళాల్ని మోహ‌రించారు. మైతీ తెగ‌ల‌కు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడ‌ర్ ఓ సీనియ‌ర్ పోలీసు అధికారిని అప‌హ‌రించ‌డంతో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి.

అయితే పోలీసు, సెక్యూర్టీ బ‌ల‌గాలు త‌క్ష‌ణ‌మే స్పందించిన రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. అద‌న‌పు ఎస్పీ అమిత్ కుమార్‌ను ఆ ద‌ళాలు కాపాడాయి. ప్ర‌స్తుతం ఆయ‌న్ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆయ‌న ఆరోగ్యం క్షేమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement