Thursday, May 2, 2024

తెలంగాణలో మద్యం షాపుల యజమానులకు గుడ్‌న్యూస్

మద్యం షాపు యజమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మద్యం షాపుల లైసెన్సులను నెల రోజుల పాటు పొడిగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‌. 2019-21 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది‌. తెలంగాణ రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను 1.11.2021 నుంచి 30.11.2021 పొడిగిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. లిక్కర్‌ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి కేసీఆర్‌ సర్కార్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement