Monday, April 29, 2024

బీసీ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్ నిధులు విడుదల

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రూ. 125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement