Thursday, May 2, 2024

తెలంగాణ ఎడ్‌సెట్-2021 ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. మాస‌బ్‌ట్యాంక్‌లోని ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలోని సెమినార్ హాల్‌లో చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి ఈ ప‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఎడ్‌సెట్‌లో 98.53 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు పేర్కొన్నారు. బీఎడ్ కోర్సులో ప్ర‌వేశాల‌కు 33,683 మంది విద్యార్థులు అర్హ‌త సాధించ‌గా, ఇందులో 25,983 మంది అమ్మాయిలు ఉన్నారు.

ఎడ్‌సెట్ ఫలితాలలో తొలి ర్యాంకు తిమ్మిశెట్టి మ‌హేంద‌ర్(న‌ల్ల‌గొండ‌) సాధించ‌గా, రెండో ర్యాంకు ఎ ప్ర‌త్యూష‌(మంచిర్యాల‌), మూడో ర్యాంకు రిషికేశ్ కుమార్ శ‌ర్మ( పాట్నా) పొందారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఎడ్‌సెట్‌ – 2021 పరీక్షను ఆగ‌స్టు నెల‌లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 42,399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement