Friday, May 17, 2024

తెలంగాణభవన్‌లో నేడు టీఆర్ ఎస్ సమావేశం

తెలంగాణ భవన్ లో ఇవాళ టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే . గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. పార్టీ శాఖల ఏర్పాటు కోసం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక హుజురాబాద్‌ ఉప ఎన్నిక వేళ.. మళ్లీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ బాస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక దళితబంధు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు… పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా రాష్ట్ర కమిటీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్.. ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సభ్యత్వ నమోదును పూర్తి చేసుకుని… క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు ప్లాన్‌ చేస్తున్న టిఆర్ఎస్‌.. భవిష్యత్‌ వ్యూహరచన కోసం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.

ఇది కూడా చదవండి: వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement