Sunday, May 19, 2024

Agri gold: బాధితుల ఖాతాల్లో నేడు జమ కానున్న నగదు

అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్తం.. ఇవాళ ఏపీ ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో నగదు చేయనున్నారు. అగ్రిగోల్డ్‌లో 10వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన వారు 3లక్షల 86వేల మందికి ఉన్నారు. వీరి కోసం 207కోట్ల 61లక్షల రూపాయలను జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. అలాగే 10వేల నుంచి 20వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన వారు మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. వీరి కోసం 459కోట్ల 23లక్షలు చెల్లించబోతున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో టెన్త్‌ పాసైన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికేట్

Advertisement

తాజా వార్తలు

Advertisement