Friday, April 26, 2024

ఏపీలో టెన్త్‌ పాసైన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికేట్

ఏపీలో 2020-21  విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఆన్ లైన్ లో మైగ్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. అందుకోసం విద్యార్థులు రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు, 2004 తర్వాత టెన్త్ పాసైన వారు కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. కాగా, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న విద్యార్ధులు మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఇది కూడా చదవండిః దళిత బంధు పథకం.. హుజురాబాద్ కు మరో రూ.500 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement