Saturday, April 27, 2024

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు

Q న్యూస్ సీఈవో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఉప్పల్‌లోని మల్లన్న నివాసం నుంచి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈ నెల 3న చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని న్యాయవాది ద్వారా సమాచారం పంపిన మల్లన్న విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు. కాగా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మల్లన్న ప్రకటించారు.

ఈ వార్త కూడా చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఈడీ

Advertisement

తాజా వార్తలు

Advertisement