శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు లక్నోలో తొలి టీ20 జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయనుంది. వెస్టిండీస్పై సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన తర్వాత, టీమిండియా అదే ఉత్సాహంతో టీ20 సిరీస్ బరిలో దిగింది. టీ20 ప్రపంచకప్ ముందు, ఈ సిరీస్లో ఇప్పటివరకు అవకాశం లేని కొంతమంది ఆటగాళ్లపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దింపనున్నాడు. శ్రీలంకతో జరిగే సిరీస్లో రోహిత్తో పాటు బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పంత్కు విశ్రాంతి ఇవ్వగా రాహుల్ గాయపడడంతో ఈ సిరీస్ నుంచి దూరమయ్యారు. హుడాకు అరంగేట్రం. శాంసన్, భువనేశ్వర్ & చాహల్ ఉన్నారు..
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్(కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..