Friday, May 3, 2024

డోంట్​ వర్రీ.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న అందరినీ తీసుకొస్తాం: జ్యోతిరాదిత్య సింధియా

ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రం బాంబు దాడులు చేస్తోందని, అందుకని అక్కడ విమాన సేవలన్నీ నిలిచిపోయాయని, ఆ దేశం ఎయిర్​ స్పేస్​ని ఓపెన్​ చేసిన తర్వాత తిరిగి విమాన సేవలను పునఃప్రారంభిస్తామని భారత్ తెలిపింది. ‘‘ఉక్రెయిన్‌కు ఇంతకుముందు విమానాలు వెళ్లాయి. ఈ రోజు కూడా అక్కడి నుంచి కొంతమందిని భారత్​కు తీసుకొచ్చాం. కానీ, 3 గంటల తర్వాత పరిస్థితులు మారాయి. అక్కడికి పంపిన విమానాలు తిరిగి వచ్చాయి. ఉక్రెయిన్​లో విమానాలు ల్యాండ్​ అయ్యే పరిస్థితులు లేవు.. అక్కడి ఎయిర్​ స్పేస్​ ఓపెన్​ చేయగానే మళ్లీ విమానాలను నడుపుతాము” అని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్​లో యుద్ధ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులతో సహా దాదాపు 18,000 మంది భారతీయులను వెనక్కి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం హామీ ఇచ్చింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement