Tuesday, May 21, 2024

Delhi | ఢిల్లీలో టంగుటూరి ప్రకాశం జయంతి.. ఏపీ భవన్-తేవా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో టంగుటూరి 151వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి కార్యక్రమాలను ప్రారంభించారు.

టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో భవన్ ఉద్యోగులతో పాటు తెలుగు ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్ (తేవా) అధ్యక్షురాలు సుశీల వరదరాజు, సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన్ – తెలుగు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని  నిర్వహించారు. రక్తదానంతో ప్రాణదానం చేయాలంటూ ఇచ్చిన పిలుపుతో పలువురు రక్తదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement