Sunday, April 28, 2024

గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన‌.. శ్వేత బ‌సు ప్ర‌సాద్

కొత్త బంగారులోకం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేత‌బ‌సు ప్ర‌సాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో ఆమెకి అవకాశాలు క్యూ కట్టాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని పాత్ర గురించి ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేసింది. అవికాస్త ఫ్లాపులుగా మిగిలాయి. దాంతో కొంచెం కొంచెంగా క్రేజ్‌ తగ్గుతూ వచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు వెబ్‌సిరీస్‌లు, సీరియల్స్‌లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్‌డే సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. అవి చూసిన ప్రేక్షకులు షాక్‌ అవుతున్నారు. శ్వేత బసు ప్రసాద్‌ ఏంటీ ఇంతలా మారిపోయింది. కొత్త బంగారు లోకంలో చబ్బీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడేంటి ఇలా తయారయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక కెరీర్‌ పరంగానే కదా పర్సనల్‌ లైఫ్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులను ఈ బ్యూటీ ఎదుర్కొంది. 2018లో డైరెక్టర్‌ రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లాడగా, విభేదాల కారణంగా ఏడాదిలోపే విడాకులు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement