Friday, May 3, 2024

మ‌రో వివాదంలో ఆదిపురుష్ సినిమా

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్‌కు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఆదిపురుష్ సినిమాపై అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పిటిషన్ దాఖలైంది. కుల్దీప్ తివారీ…ప్రజా ప్రయోజనం వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు సినిమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషన్ లో పేర్కొన్నారు కుల్దీప్ తివారీ. పిటిషన్ పై స్పందించాల్సిందిగా సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది బెంచ్. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement