Sunday, May 5, 2024

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసులు మృతి

ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది పోలీసులు మృతి చెందిన ఘ‌ట‌న పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో జరిగింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్‌ మోటర్‌ సైకిల్‌ తో పోలీసు ట్రక్కు ను బలంగా ఢీ కొట్టిన‌ ఘటనలో తొమ్మిది మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. బలూచిస్థాన్ లో పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందని ఆరోపిస్తూ.. బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement