Sunday, May 5, 2024

ఫీజు రీయింబర్స్ మెంట్ ఎక్కడ ? విద్యార్థుల ఆందోళన

ఇంటర్ 1st ఇయర్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సెయింట్ తెరిస్సా కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే ఇవ్వాలంటూ విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం ఫీజులు దౌర్జన్యంగా వసూలు చేసి, ఇప్పుడు ఆన్ లైన్ చేయకుండా రీయింబర్స్ అడ్డుకున్నారని విద్యార్థులంతా కూడా ఆలోపిస్తున్నారు.

దీనిపై వెంటనే యాజమాన్యం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని విద్యార్థులంతా కూడా హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటామని తల్లిదండ్రులు సైతం బైఠాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement