Monday, April 29, 2024

భారీ లాభాల‌తో దూసుకుపోయిన – స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల‌తో దూసుకుపోయాయి. కీలక కౌంటర్లలో కొనుగోళ్లు, ఆశాజనకంగా ఉన్న కార్పొరేట్ ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816కి చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 16,641కి ఎగబాకింది. సన్ ఫార్మా (3.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.76%), ఎల్ అండ్ టీ (2.67%), టీసీఎస్ (2.33%), ఏసియన్ పెయింట్స్ (2.31%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతి ఎయిర్ టెల్ (-1.32%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.17%), ఎన్టీపీసీ (-0.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.09%), రిలయన్స్ (-0.05%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement