Wednesday, May 15, 2024

ఏడోరోజు న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

వ‌రుస‌గా ఏడ‌వ రోజు న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 16,818 వద్ద స్థిరపడింది. ఐటీసీ (2.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.16%), టాటా స్టీల్ (1.68%), సన్ ఫార్మా (1.38%), నెస్లే ఇండియా (1.17%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఏసియన్ పెయింట్స్ (-5.22%), టెక్ మహీంద్రా (-1.86%), టైటాన్ (-1.69%), కోటక్ బ్యాంక్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.36%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement