Monday, April 29, 2024

State of kailasa – నిత్యానంద దేశానికీ ప్రధానిగా నటి రంజిత

చెన్నై – వివాద స్పద స్వామి నిత్యానంద. అత్యాచార ఆరోపణ తీవ్రతరం కావడంతో స్వామి నిత్యానంద దేశం నుంచి పారిపోయారు. అనంతరం తనకంటూ ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించుకున్నాడు దానికి యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస (కైలాస దేశ) అని పేరు పెట్టుకున్నాడు. ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక పాలన ను ఏర్పాటు. అయితే..తాజాగా అయన ఓ సంచలన ప్రకటన చేశారు..

ఆ దేశానికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిమంత్రిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కూడా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది..పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన రంజిత ఎంతో మంది అభిమానులకు సొంత చేసుకుంది. కెరీర్ మంచి ఫీక్స్ లో ఉన్న సమయంలో నిత్యానంద చెంత చేరింది. ఇప్పుడు ప్రధాని కూడ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement