Thursday, May 2, 2024

ఎస్‌బీఐలో 6,100 పోస్టుల భర్తీ.. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,100 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు సంబంధించి తెలంగాణలో 125, ఏపీలో 100 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అప్రెంటీస్ పోస్టులకు డిగ్రీ అర్హత కావడంతో లక్షల్లో అభ్యర్థులు అప్లై చేశారు. 2021 ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ పోస్టులకు ఎస్‌బీఐ ఎలా ఎంపిక చేస్తుంది? సెలక్షన్ ఎలా ఉండబోతుంది?

అప్రెంటీస్ పోస్టులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ నిర్వహించడం ద్వారా అధికారులు ఎంపిక చేయనున్నారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. గంట సమయం ఉంటుంది. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు. క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. సమయం 15 నిమిషాలు.

ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో హైదరాబాద్, కరీంగనర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. రాతపరీక్షలో ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషలో ఉంటాయి. నెగిటీవ్ మార్కింగ్ ఉంది. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. మినిమమ్ క్వాలిఫయింగ్ మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తుంది ఎస్‌బీఐ. ఇద్దరికీ సేమ్ కటాఫ్ మార్కులు వస్తే వయస్సు ఆధారంగా ఒకరిని ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో ఎంపిక అయిన వారికి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే అప్రెంటీస్ పోస్టుకు అర్హులు. టెన్త్ లేదా ఇంటర్‌లో స్థానిక భాషలో చదివినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్‌తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాతే ఫైనల్ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఈ వార్త కూడా చదవండి: మీరాబాయికి రైల్వేశాఖ బంపర్ ఆఫర్

Advertisement

తాజా వార్తలు

Advertisement