Thursday, April 25, 2024

మీరాబాయి చానుకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్

ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. సోమ‌వారం ఇండియాకు తిరిగి వ‌చ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను క‌లిసింది. ఈ సంద‌ర్భంగా మీరాబాయిని ఆయ‌న‌ స‌న్మానించారు. అంతేకాదు రూ.2 కోట్ల న‌గ‌దు, ఈశాన్య రైల్వేలో ప్ర‌మోష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను త‌న నైపుణ్యం, క‌ఠోర శ్ర‌మ‌, మొక్క‌వోని దీక్ష‌తో కోట్లాది మంది భారతీయుల‌లో స్ఫూర్తి నింపింద‌ని అశ్విని వైష్ణ‌వ్ అన్నారు. ఆమెను క‌ల‌వ‌డం, స‌న్మానించ‌డం సంతోషంగా ఉంద‌ని ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే ఈశాన్య రైల్వేలో ప‌ని చేస్తున్న ఆమెను ఇప్పుడు ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా ప్ర‌మోట్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సూర్యకుమార్, పృథ్వీ షా

Advertisement

తాజా వార్తలు

Advertisement