Thursday, April 25, 2024

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సూర్యకుమార్, పృథ్వీ షా

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా గాయాలతో సతమతం అవుతోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లోనే ఉంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే ముగ్గురు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బైగా ఎంపికైన పేసర్ అవేష్ ఖాన్ గాయపడ్డారు. వీరు కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలపడంతో వారి స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది.

దీంతో ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలను ఇంగ్లండ్ పంపాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. వీరిలో పృథ్వీ షాకి ఇప్పటికే టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఇదే తొలి టెస్టు సిరీస్ కానుంది. సూర్యకుమార్ ఈ ఏడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి వన్డే సిరీస్‌లోనే సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: గంభీర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement