Tuesday, April 30, 2024

ముంబై ఫోటోగ్రాఫ‌ర్ ఇంట్లో ఎస్ ఎస్ ఎంబీ28 చిత్ర టీం.. ఫోటో పోస్ట్ చేసిన న‌మ్ర‌త‌

ముంబై చేరుకుంది ఎస్ ఎస్ ఎంబీ28 చిత్ర టీం. సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన పర్సనల్ అయినా.. ప్రొఫెషనల్ అయినా ప్రతి అప్‌డేట్‌నీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటుంటారు ఆయన సతీమణి నమ్రత. అప్పుడప్పుడు మహేష్ కూడా తన పిల్లలకు సబంధించిన విషయాలు నెట్టింటిలో పంచుకుంటారు. ఈక్రమంలోనే మహేష్ బాబు.. ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ సినిమాకు సబంధించి క్రేజీ అప్ డేట్ నెట్టింట‌ వైరల్ అవుతుంది. అయితే అంతకంటే ముందు ఓ కూల్ డ్రింక్ యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లారు మహేష్. అక్కడి నుంచి దుబయ్ వెళ్లబోతున్నారు.

ఈ సంద‌ర్భంగా ముంబయ్ లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఇంట్లో డిన్నర్ చేశారు మహేష్ అండ్ టీం. వారు నమ్రత ఫ్రెండ్ కావడంతో అక్కడ సందడి చేశారు. ఇందులో భాగంగా మహేష్, నమ్రతలతో పాటు SSMB 28 టీమ్.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డైరెక్టర్ త్రివిక్రమ్, మరో దర్శకుడు మెహర్ రమేష్ అందరూ కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ముంబయ్ నుంచి టీమ్ అంతా డైరెక్ట్ గా దుబయ్ వెళ్లబోతున్నారు. అక్కడ ఈసినిమాకు సబంధించిన మ్యూజిక్ సిట్టిగ్స్ ను ఏర్పటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ మ్యూజిక్ కు సబంధించిన క్లారిటీ వచ్చిన తరువాత మళ్ళీ ఇండియాకు రాబోతున్నారు టీమ్. వచ్చీ రాగానే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement