Friday, May 3, 2024

దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

అమరావతి,ఆంధ్రప్రభ: దసరా సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వచ్చేనెల ఒకటో తేదీ నుండి 29వ తేదీ వరకు భువనేశ్వర్‌ నుండి తిరుపతి వరకు, రెండో తేదీ నుంచి 30వ తేదీ వరకు తిరుపతి నుండి భువనేశ్వర్‌కు ప్రత్యేకంగా రైలు తిరగనుంది. వచ్చే నెల ఐదో తేదీ నుంచి 26వ తేదీ వరకు విశాఖ పట్నం నుండి సికింద్రాబాద్‌ ప్రతి బుధవారం, సికింద్రాబాద్‌ నుండి విశాఖ పట్నానికి వచ్చేనెల ఏడో తేదీ నుంచి 27 తేదీ వరకు ప్రతి గురువారం, విశాఖపట్నం నుండి మహబూబ్‌నగర్‌కు వచ్చేనెల నాలుగో తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రతి మంగళవారం, మహబూబ్‌ నగర్‌ నుండి విశాఖపట్నం ఐదో తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రతి బుధవారం రైళ్లు నడవనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement