Thursday, May 9, 2024

ఇంధ‌న‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా – సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విజ‌యానంద్

ఏపీ ఇంధ‌న‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విజ‌యానంద్ ని నియ‌మించిది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా విజ‌యానంద్ ప‌నిచేశారు. సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో ప‌నిచేసిన విజ‌యానంద్ ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌ను ప‌క్కాగా అమ‌లు చేశారన్న‌గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఐదేళ్ల‌కు మించి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా ఏ ఒక్క అధికారి పని చేయ‌డానికి వీల్లేద‌న్న నిబంధ‌న మేర‌కు విజ‌యానంద్‌ను ఇటీవ‌లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆ ప‌ద‌వి నుంచి ఆయ‌న‌ను త‌ప్పించింది. విజ‌యానంద్ స్థానంలో కొత్త‌గా ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా నియ‌మితుల‌య్యారు. ఈ క్ర‌మంలో గ‌త కొంత‌కాలంగా వెయిటింగ్‌లో ఉన్న విజ‌యానంద్‌కు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement