Sunday, May 5, 2024

భార‌త్ లో ఆత్మాహుతి దాడుల‌కు అల్ ఖైదా స్కెచ్ రెడీ !

నూపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, ఖ‌తార్‌, సౌదీ అరేబియా, ఒమ‌న్‌, యూఏఈ, జోర్దాన్‌, ఆప్ఘ‌నిస్థాన్‌, పాకిస్తాన్‌, బ‌హ్రెయిన్‌, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా స‌హా 14 దేశాలు ఖండించాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై అల్ ఖైదా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేపడతామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ విడుదల చేసింది. “మా ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేహాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి” అంటూ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement